Saturday, October 24, 2015

Indian currency

నం ప్రతీరోజు చూసే వస్తువుల గురించి మనకు తెలియని విషయాలు చాల ఉంటాయి.పది,ఇరవై, యాభై,వంద రూపాయల నోట్లని లెక్కలేనన్ని సార్లు చూసుంటాం. అన్ని నోట్లపైనా ముందువైపు గాంధీజీ బొమ్మ ఉన్నా, వెనక వైపు మాత్రం ఒక్కో నోటుకు ఒక్కో బొమ్మ కనిపిస్తుంది.



మన దేశానికి గర్వకారణంగా నిలిచే జంతువులూ,పరిస్థితులూ,నిర్మాణాల లాంటివి మాత్రమే కరెన్సీ నోట్లపైన కనిపించాలన్నది ఆర్ బీ ఐ నిబంధన. దాని ప్రకారమే వెయ్యి నోట్లపైన దేశానికి అత్యధిక ఆదాయాన్ని అందిస్తోన్న వ్యవసాయం,చమురు,విద్యుత్ తదితర రంగాలను సూచించే ముద్రలు కనిపిస్తాయి. దేశ స్వాతంత్ర్యంలో కీలక పాత్ర పోషించిన దండిమార్చ్ నమూనా చిత్రం 500 రూపాయల నోటుపైన కనిపిస్తుంది.దేశానికి తలమానికంగా నిలిచే హిమాలయ శిఖరాలు వంద రూపాయల నోటుపైన కనిపిస్తాయి. యాభై రూపాయల నోటుపైన అతిపెద్ద ప్రజాస్వామ్యానికి సూచికంగా పార్లమెంటు భవనం,పది రూపాయల నోటుపైన జాతియ మృగం పులితో పాటు,ఏనుగు, ఖద్గమృగాల చిత్రాలుంటాయి.

ఈ చిత్రాలను దాదాపు అందరు గుర్తుపట్టగలరు. కానీ ఇరవై రూపాయల నోటుపైన ఉన్న చిత్రం గురించి మాత్రం చాల మందికి తెలీదు. అండమాన్,నికోబర్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేయిర్ లోని మౌంట్ హరీట్ జాతీయ పార్కులోని దృశ్యమే ఆ నోటు మీద కనిపించే చిత్రం.. దేశంలో అత్యంత జీవవైవిధ్యం కనిపించే ప్రాంతాల్లో ఆ పార్కు ఒకటి. ఆ పార్కుకు ఎదురుగా ఉన్న మెగాపోడ్ రిసార్ట్ లోని ఓ కిటికి నుంచి ఆ పార్కు ఫోటో తీసినపుడు కనిపించిన దృశ్యాన్నే యథాతథంగా 20 రూపాయల నోటుపైన ముద్రించారు. జాతియ పార్కుతో పాటు ప్రఖ్యాత అండమాన్ లైట్ హౌస్, సముద్రతీరం కూడ ఆ చిత్రంలో కనిపిస్తాయి.

No comments:

Post a Comment